మల్లాపూర్, మే 18: బీఆర్ఎస్ సర్కారు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆపదలో ఉన్న బీజేపీ నేత కుటుంబానికి రూ.లక్ష సీఎంసహాయనిధి మంజూరు చేసి భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మాజీ సర్పంచ్ గోపిడి రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో చికిత్సపొందుతూ మరణించాడు.
బీజేపీలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన కొడుకు శ్రీనివాస్రెడ్డి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేశాడు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చొరవతో సర్కారు రూ.లక్ష మం జూరు చేయగా గురువారం శ్రీనివాస్రెడ్డి సదరు చెక్కు అందుకున్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు, ప్రభుత్వానికి శ్రీనివాస్రెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.