భువనగిరి కలెక్టరేట్, మార్చి 11: భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన ప్రాంతంలో నయీం అనుచరుడు, రౌడీషీటర్ బా బా కొబ్బరి బొండాల కత్తితో సాయితేజ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు నరేశ్పై దాడి చేయగా.. నరేశ్ చెవి, మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న నరేశ్ను ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పరామర్శించారు. డీసీపీ రాజేశ్చంద్రతో ఫోన్లో మాట్లాడి దాడి చేసిన బాబా, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.