హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిం చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సమర్పించిన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదిం చింది. దీంతో ఆయనను సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. తన భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తానని, తాను ఎవరికీ అమ్ముడుపోలేదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళ వారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో పర్యటించారు.