మాదాపూర్, ఏప్రిల్ 20: విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి శిక్షణే లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్ యాప్’ను అందుబాటులోకి తెచ్చామని శ్రీ చైతన్య, ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. బుధవారం శ్రీచైతన్య ‘ఇన్ఫినిటీ లెర్న్ యాప్’ను టీమిండియా క్యాప్టన్ రోహిత్ శర్మ ఇన్స్టాలైవ్లో ఆవిష్కరించారని ఆమె వెల్లడించారు.
మాదాపూర్లోని ఎన్సీసీ భవనంలో సుష్మ బొప్పన మాట్లాడుతూ విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా ఈ యాప్ను తయారు చేసినట్టు తెలిపారు. జేఈఈ, నీట్ ప్రాక్టికల్ టీచింగ్ అత్యంత సులభంగా అర్థమయ్యేలా యాప్ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇన్ఫినిటీ లెర్న్ సీఈఓ, అధ్యక్షుడు ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని తాము అందించే శిక్షణ ద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవచ్చని వెల్లడించారు.