డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంతస్థులతో పాటు ఆరో అంతస్థులో ఉన్న సీఎం కార్యాలయాన్ని పరిశీలించారు. రోజంతా అక్కడే ఉండి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
– హైదరాబాద్,నమస్తే తెలంగాణ