హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం ముందు రోడ్డును పూర్తిగా రీడిజైన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగం గా బీఆర్కే భవన్ వైపు నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు, నెక్లెస్ రోడ్డు వైపు నుం చి వచ్చే వాహనాలు సునాయాసంగా నలువైపులా వెళ్లేలా రెండు ట్రాఫిక్ ఐలాండ్లను నిర్మించాలని నిర్ణయించారు. సచివాలయం నుంచి లుంబినీ పార్క్, అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. సచివాలయం నలుదిక్కులా వాహనాలు సునాయాసంగా వెళ్లేలా రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. పాదచారులు రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను అవసరమైనచోట్ల నిర్మించాలని నిశ్చయించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి మంగళవారం సచివాలయం వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు రీడిజైనింగ్ ప్రణాళికకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.