సిద్దిపేట : మంత్రి హరీశ్రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మంత్రి హరీశ్రావు ఎప్పుడు ముందే ఉంటారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగంళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ..చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి భార్య, పిల్లకు గాయాలయ్యాయి.
అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి హరీశ్రావు ప్రమాదాన్ని చూసి ఆగారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరుండి అంబులెన్స్ సిద్దిపేట దవాఖానకు పంపించారు. మంత్రి చొరవకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.