మహదేవపూర్, జూలై 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద నీరు పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో బుధవారం ఇన్ఫ్లో 6,37,220 క్యూసెక్కులు రాగా, ప్రస్తుతం గురువారం ఇన్ఫ్లో 7,31,240 క్యూసెక్కులకు పెరిగింది. అధికారులు బరాజ్ 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.