మహదేవపూర్, సెప్టెంబర్ 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 3,72,165 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో బరాజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ ప్రస్తుత నీటిమట్టం 5.70 మీటర్లుగా ఉందని ఆయన తెలిపారు.