వరంగల్ : కల్యాణలక్ష్మి పథకానికి ప్రేరణ ఇచ్చిన నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన లూనావత్ కల్పన కూతురు చంద్రకళ- చందర్ నవ దంపతుల వివాహం ఘనంగా జరిగింది. ఈ నూతన జంటను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్తో కలిసి మంత్రి ఆశీర్వదించారు.
నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత ఖర్చులతో పెండ్లి జరిపించారు. నర్సంపేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెండ్లికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.