బాసర, మే 28 : బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ను బుధవారం వైస్ చాన్స్లర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బాసర సెంటర్లో 1500 సీట్లు, మహబూబ్నగర్ సెంటర్లో 180 సీట్లకు ఆరేండ్ల సమీకృత విద్యావిధానంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. పూర్తి వివరాలను ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైట్లో ఉంచామని పేర్కొన్నారు.