దుండిగల్, ఫిబ్రవరి1: బీఆర్ఎస్ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పులు తథ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జోస్యం చెప్పారు. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం వారు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశంలో సమూల మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నదని తెలిపారు. పార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, నాందేడ్ ప్రాంత నాయకులు పాల్గొన్నారు.