కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 5: ఓసీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు ఖండించారు. ఓసీలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు దిగజారుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
కేసీఆర్తో రాజకీయ వైరుధ్యాలు ఉండటాన్ని తప్పుపట్టడం లేదని, కానీ హుందాగా సద్విమర్శలు చేసుకోవాలని సూచించారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర మాజీ ప్రజాప్రతినిధులు సహా జాతి మొత్తాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. రేవంత్రెడ్డి గతంలోనూ అనేకసార్లు కించపరిచే వ్యాఖ్యలు చేసి సీఎం పదవికే మచ్చ తెచ్చారని మండిపడ్డారు. తక్షణమే తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు అండెం రమణారెడ్డి. కొత్తకొండ రవీందర్రావు, చీటి రవీందర్రావు, ద్యావనపల్లి రాంకిషన్ రావు, జిల్లా అంజయ్య, విక్రమ్ నరసింగారావు, తీగల లక్ష్మణ్రావు, తోపు శ్రీనివాస్, గడ్డం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.