హైదరాబాద్, అక్టోబర్20(నమస్తే తెలంగాణ): రెండ్రోజుల్లో తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో 21,22న అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశ ఉన్నదని పేర్కొన్నది. 23, 24న రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడవచ్చని పేర్కొన్నది.