హనుమకొండ, ఫిబ్రవరి 19 : హనుమకొండ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు జీ సమ్మిరెడ్డి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ‘సీఎం సారూ… నన్ను బతికించండి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది.
సమ్మిరెడ్డికి చెల్లించాల్సిన విరమణ బెనిఫిట్స్కు సంబంధించి అధికారులు ఫోన్ చేసి వివరాలు సేకరించి ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు కుటుంబసభ్యులు, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ సభ్యులు చెప్పారు. సమ్మిరెడ్డి ఇబ్బందులను వెలుగులో తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.