హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఆ పార్టీ భువనగిరి కూడా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి తనను కూడా వెళ్లగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మండిపడ్డారు.
‘నా నియోజకవర్గం పరిధిలో నన్ను అడగకుండా రేవంత్రెడ్డి మీటింగ్ ఎలా పెడుతారు?’ అని ప్రశ్నించారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ను పార్టీలో ఎలా చేర్చుకున్నారని నిలదీశారు. పార్టీలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వీటిపై సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటానని అన్నారు.