నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 18: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మెచ్చి ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 43 మంది అవుట్ సోర్సింగ్ జవాన్లు, ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న వంద మంది కార్మికులు టీఆర్ఎస్కేవీలో చేరారు. వీరందరికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల చౌట్పల్లికి చెందిన పుప్పాల నిరంజన్తోపాటు పలువురు యువకులు హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. వీరికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం, ఉయ్యాలవాడ గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.