హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మాతృభాషల్లోను నిర్వహిస్తు న్న నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)కు విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఏటా దరఖాస్తుల్లో పురోగతి కనిపించడంలేదు. నీట్కు హాజరయ్యేవారిలో అత్యధికులు ఇం గ్లిష్, హిందీ భాషలవైపే మొగ్గుచూపుతున్నా రు. ఈ ఏడాది సైతం అదే ఒరవడి కొనసాగింది. 2019 నుంచి నీట్ను ఇంగ్లిష్, హిం దీతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, మలయాళం, ఒరియా, తమిళ్, తెలుగు, ఉర్దూ వంటి భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. 2019లో ప్రాంతీయ భా షల్లో నీట్ రాసేందుకు 1,34,550 మంది దరఖాస్తు చేసుకుంటే, 2020లో 1,29, 763కు తగ్గింది. 2021లో 1,20,616కు పడిపోగా, ఈ ఏడాది కాస్త పెరిగి 1,37,492కు చేరింది. మొత్తంగా నీట్కు 18.72 లక్షల మంది హాజరవుతుండగా, ప్రాంతీయ భాషల్లో నీట్రాసేవారి సంఖ్య 10శాతం కూడా లేకపోవడం గమనార్హం.
హిందీ, ఇంగ్లిష్ తర్వాత గుజరాతీ భా షలో నీట్కు అధిక దరఖాస్తులు రాగా, తర్వాత బెంగాలీ భాషకు వచ్చాయి.
ఈ ఏడాది 18 లక్షల మంది నీట్కు దరఖాస్తు చేసుకుంటే.. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసినవారు 17.34 లక్షలుండగా, 1,37,492 మంది మాత్రమే ప్రాంతీయభాషల్లో నీట్కు సిద్ధపడ్డారు.
భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడులో ఈ ఏడాది 1,42,894 మం ది విద్యార్థులు నీట్కు దరఖాస్తు చేసుకుంటే, వీరిలో 31,965 మంది తమి ళం ఎంచుకున్నారు. నాలుగేండ్లుగా తమిళంలో రాసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2019లో 1,017 మంది మాత్రమే తమిళంలో రాస్తే, ఈ ఏడాది 31 వేలకు పెరిగింది.
తెలంగాణ నుంచి 61,207 మంది విద్యార్థులు, ఏపీ నుంచి 68,061 మంది విద్యార్థులు నీట్కు దరఖాస్తు సమర్పిస్తే, వీరిలో 1,264 మంది మాత్రమే తెలుగులో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
పంజాబీ, మలయాళం భాషల్లో 2019, 2020 సంవత్సరాల్లో ఒక్కరు కూడా హాజరుకాకపోగా, పంజాబీలో 2021లో 104, 2022లో 96, మలయాళంలో 2021లో 3,031, 2022లో 1,510 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అన్నింటికీ భిన్నంగా బెంగాలీ భాషలో నీట్కు హాజరయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2019లో 4,750 మంది విద్యార్థులు మాత్రమే బెంగాలీలో రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2020లో 36,593, 2021లో 35,110, 2022లో 42,663కు చేరింది.
ఎంబీబీఎస్ ఇంగ్లిష్ మీడియం కాబట్టే..
ఇంటర్ వరకు మాతృభాషలో చదివినా.. నీట్ రాసినా ఎంబీబీఎస్ను ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. దేశమంతటా ఎంబీబీఎస్ను ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తున్నారు. దీంతోనే అత్యధికులు నీట్ను ఇంగ్లిష్లో రాసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీబెల్ట్లోనే కొన్ని హిందీ మీడియం పాఠశాలలున్నాయి. దీంతోనే ఇంగ్లిష్, ఆ తర్వాత హిందీలో రాసేవారి సంఖ్య అత్యధికంగా ఉన్నది.
– శంకర్రావు, నీట్ ఫ్యాకల్టీ