హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమసే తెలంగాణ): భవిష్యత్తులో ప్రతి అంశంలో మేధో సంపత్తి హకుల ప్రమేయం ఉంటుందని, ఆ హక్కులను కాపాడుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉద్యాన విశ్వవిద్యాలయం-మేధో సంపత్తి హకుల విభాగం సంయుక్తంగా ‘తెలంగాణలో ఉద్యానపంటల వాణిజ్య పంథాలో మేధో సంపత్తి హకుల పాత్ర’పై సదస్సు నిర్వహించింది.
ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యానరంగంలో మేధో సంపత్తి హకులకు చాలా ప్రాధాన్యం ఉన్నదని చెప్పారు. ప్రముఖ అడ్వకేట్, రిజల్యూట్ ఫర్ ఐపీ, లీగల్ హెడ్ సుభాజిత్ సాహా ఉద్యాన పంటల్లో భౌగోళిక గుర్తింపులు, కాపీరైట్లపై కీలకోపన్యాసం చేశారు. సదస్సులో పేటెంట్ ఏజెంట్ డాక్టర్ రాధిక వంగాల, వర్సిటీ డీన్ ఆప్ హార్టికల్చర్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్, పీజీ డీన్ డాక్టర్ ఎం రాజశేఖర్, వర్సిటీ మేధో సంపత్తి హకుల పరిరక్షణ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.