హైదరాబాద్: జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారి రాజ్భవన్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. కోవిడ్ వల్ల ప్రతి సంవత్సరం పబ్లిక్ గార్డెన్స్లో జరగాల్సిన వేడుకలను ఈసారి రాజ్భవన్కు మార్చారు. రాజ్భవన్లో అధికారికంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.