హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా వర్సిటీకి చెందిన 3,500 చదరపు గజాల స్థలంలో చోటుచేసుకొన్న అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తులసీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చేసిన 9 అక్రమ రిజిస్ట్రేషన్లపై దర్యాప్తు నివేదికను సమర్పించాలని కోరింది. ఈ వివాదం పరిషారమయ్యే వరకు వర్సిటీలో ప్లాట్ల క్రయ విక్రయాలు, వాటిలో నిర్మాణాలు చేయరాదని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు హైకోర్టు సీజే సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూ భూములను రక్షించడంలో వర్సిటీ అధికారులు విఫరమయ్యారంటూ రిసెర్చ్ సాలర్ పీ రమణారావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణను జూలై 14కు వాయిదా వేసింది.