హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో గత కొంతకాలంగా స్వల్ప కారణాలతో తొలిగించబడిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సుమారు 1500 మందికి పైగా ఉద్యోగులను స్పల్ప కారణాలతో విధుల నుంచి తొలిగించడం వల్ల వారి కుటుంబాలకు జీవనోపాధి కరువైందని తెలిపారు.