పాట్నా నగరంలో కనిపించే ఈ కాంస్య విగ్రహాలకు గొప్ప చరిత్ర ఉంది. ఈ విగ్రహాల్లో కనిపించే ధోతీ, కుర్తా ధరించిన ఏడుగురూ విద్యార్థులే! డబ్బు ఆరేళ్ల క్రితం జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి ఈ విగ్రహాలు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ బీహారీ పోరుబిడ్డలు ‘సెవెన్ సన్స్ ఆఫ్ బీహార్’గా చరిత్రలో నిలిచిపోయారు.
భారత జాతీయ కాంగ్రెస్.. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపారు. పోరాటాల పిలుపు యువతను కదిలించింది. బ్రిటిష్ వాడి దాష్టీకాలు నెత్తురు మండించాయి. పాట్నాలోని సచివాలయంపై స్వరాజ్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా విద్యార్థులు కదం తొక్కారు.
మధ్యాహ్నం రెండు గంటలకు విద్యార్థి ఊరేగింపు సెక్రటేరియట్కు చేరుకుంది. దీనిని బీహార్ మిలిటరీ పోలీసులు అడ్డుకున్నారు. సైనికాధికారి కాల్పులకు ఆదేశించాడు. కానీ, రాజ్పుత్ సైనికులు భారతీయులను కాల్చలేమంటూ తుపాకులు దించేశారు. దీంతో గూర్ఖా సైనికులను దింపారు. ఎవరి చేతిలోనైతే స్వరాజ్ జెండా ఉందో వాళ్లనే కాల్చాలని అధికారి ఆదేశాలిచ్చాడు. తుపాకీ పేలగానే జెండా పట్టుకున్న విద్యార్థి నేలకూలాడు. తన చేతిలోని జెండాను మరో సహచరుడికి అందించాడు. ఆ జెండాని అందుకున్న రెండో విద్యార్థిపై కాల్పులు జరిపారు. అతనూ కుప్పకూలుతూ జెండాను మరో విద్యార్థికి అందించాడు. ఇలా ఏడుగురు విద్యార్థులు ఒకరి తర్వాత మరొకరు స్వరాజ్జెండాని ఎత్తిపట్టి, అమరులయ్యారు.
ఏడుగురు ముద్దుబిడ్డలు
ఉమాకాంత్ ప్రసాద్సిన్హా (తొమ్మిదో తరగతి), రామానందసింగ్ (తొమ్మిదో తరగతి), సతీశ్ ప్రసాద్ఝా (పదో తరగతి),
జగత్పతి కుమార్ (తొమ్మిదో తరగతి), దేవీపాదచౌదరీ (తొమ్మిదో తరగతి), రాజేంద్రసింగ్ (పదో తరగతి), రావ్ు గోవింద్సింగ్ (తొమ్మిదో తరగతి)