హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు టీటీడీకి రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో తొలి విడుత కింద 15 ఈ-బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. మిగిలిన 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు టీటీడీ తెలిపింది.