హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించా రు. ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించా రు. నాగర్కర్నూల్, పెద్దపల్లి బస్డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేములవాడ, కథలాపూర్, హుజూర్నగర్, కోదాడ, నాగర్కర్నూ ల్ బస్ స్టేషన్లకు సైతం త్వరలో శంకుస్థాపనలు చేయనున్నట్టు చెప్పారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతోపాటు త్వరలో రూ. కోటి చెక్కు అందజేయనున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కారుణ్య ని యామకాలను వెంటనే పూర్తి చేయాల ని అధికారులకు మంత్రి సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. ప్రతి రోజూ 61 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు పొందుతున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఈడీ సీహెచ్ వెంకన్న, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.