ఎల్బీనగర్, మే 22: తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం ఈ నెల 27న మేడ్చల్లో జరిగే రెడ్ల మహా సంగ్రామ సభను జయప్రదం చేయాలని రెడ్ల జేఏసీ, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బద్దురి వెంకటేశ్వర్రెడ్డి, నాయకుడు అనంతుల సురేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తపేట డివిజన్ స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం భవనంలో రెడ్ల మహా సంగ్రామ సభ వాల్పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్ల జేఏసీ మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సుమతిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేందర్రెడ్డి, కార్యదర్శి లక్ష్మారెడ్డి, గుమ్మడి వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.