హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 2,656 మంది ధూప దీప నైవేధ్యం (డీడీఎన్) అర్చకులకు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల గౌరవ వేతనాల కింద రూ. 46.81కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2023-24వార్షిక బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.