హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య విభాగంలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఆర్ఈఐఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 116 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీలు), మరో 21 మంది ఎంపీహెచ్డబ్ల్యూల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో-22ను విడుదల చేశారు. ఇప్పటికే 5 వేలకు పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులను ఇప్పటికే క్రమబద్ధీకరించారు.