హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్పోర్ట్ కేంద్రాలు సేవలందిస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ (అమీర్పేట్, బేగంపేట్, టోలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్లోని పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. సాధారణంగా పీసీసీ కోసం మూడు వారాలు పడుతుందని, కానీ దరఖాస్తుదారులు వారి వేగవంతమైన అవసరాల కోసం పాస్పోర్ట్ అధికారులకు విజప్తి చేసుకొన్నారని తెలిపారు.