హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : ఈనెల 28న బక్రీద్ సెలవుతో ఆరోజు స్లాట్స్ 27వ తేదీకి బదలాయించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే స్నేహజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు గురువారం స్లాట్స్ను బుధవారం వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే మెయిల్స్, సందేశాలు పంపించినట్టు తెలిపారు. పాస్పోర్ట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. స్లాట్స్ను తమకు అనుగుణమైన తేదీల్లో రీషెడ్యూల్ చేసుకోవచ్చని స్నేహజ వివరించారు.