హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్టారు. బండి సంజయ్.. మరోసారి నీ అజ్ఞానాన్ని, అవివేకాన్ని, ఓర్వలేనితనాన్ని, అబద్ధాలకోరుతనాన్ని బయట పెట్టుకున్నావని ధ్వజమెత్తారు. గిరిజనుల గడ్డ ములుగు వేదికగా బండి సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయాడని, గిరిజనులకు అన్యాయం చేస్తున్నదే కేంద్రంలోని మోదీ సరార్ అని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ సరారు కట్టుబడి ఉన్నదని, దానికి నిదర్శనమే ములుగు జిల్లా ఏర్పాటని చెప్పారు. తండాలను పంచాయతీలు చేసి స్వపరిపాలన, సుపరిపాలన దిశగా అడుగులు వేయించింది కేసీఆరేనని స్పష్టం చేశారు. ములుగును మునిసిపాలిటీగా చేసింది కేసీఆర్ అనే విషయం కూడా తెలియకుండా మాట్లాడటం బండి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీకి విధి విధానాలు కూడా ఖరారయ్యాయని, త్వరలోనే అడవి బిడ్డలకు పట్టాలించేందుకు కసరత్తు జరుగుతున్నదని వివరించారు. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములు అకడున్న గిరిజనులకే చెందుతాయని కేంద్రం నుంచి ఆదేశాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అడవి బిడ్డలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎస్టీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని స్పష్టం చేశారు. కేంద్ర ఆమోదం తెలుపకుండా పకన పెట్టి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశామని చెప్పుకోవడం తప్ప.. దేశవ్యాప్తంగా ఉన్న అడవిబిడ్డలకు మోదీ సరారు చేసింది గుండు సున్నా అని తేల్చి చెప్పారు. అడవి బిడ్డలకు కేంద్రం ఇస్తానన్న గిరిజన యూనివర్సిటీ గురించి ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. తమ సరారుకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే స్థలం కూడా కేటాయించినట్టు తెలిపారు. గిరిజన బిడ్డల మహా జాతర మేడారానికి జాతీయ హోదా గురించి ఎందుకు మాట్లాడవని డిమాండ్ చేశారు.
రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధిపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న సన్నాసి ఒకసారి లెకలు చూసి మాట్లాడాలని బండి సంజయ్కు సతీశ్రెడ్డి హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ సంస్థలే ప్రశంసిస్తున్నాయని, మోదీ పాలనను తులనాడుతున్నాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ గురించి ఎందుకు మాట్లాడవని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి వరుసగా నోటిఫికేషన్ ఇస్తుంటే, పేపర్లు లీకేజ్ చేయించి, కోర్టులో కేసులు వేయించి ఉద్యోగాలు భర్తీ కాకుండా ఆపుతున్న సన్నాసులు మీరని విమర్శించారు. రాష్ట్ర జీడీపీ 155 శాతంతో దేశంలోనే అత్యధికంగా ఉందని, తలసరి ఆదాయంలోనూ 3,08,732తో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో 162 లక్షల కోట్ల అప్పులు చేసి కార్పొరేట్లకు దోచి పెట్టింది మోదీ అని విమర్శించారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.