Red Meat | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): మాంసాహారాన్ని ఎక్కువగా తినేవారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం పేరొన్నది.
తకువ పరిమాణంలో తినడం లేదా రెడ్మీట్, ప్రాసెస్ చేసిన మాంసానికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు. 10 లక్షల మంది పాల్గొన్న ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ క్లినికల్ అంకాలజీలో ప్రచురితమైంది. ఎకువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం వరకు ఉంటుందని, ఇందులో మరణించే ప్రమాదం 16 శాతం ఉందని ఈ అధ్యయనం చేసిన ప్రధాన రచయిత డాక్టర్ షీనా అయాతుంగయ్ తెలిపింది.
అదే సమయంలో రెడ్మీట్ ఎకువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9శాతం పెరిగినట్టు వెల్లడించింది. వీటి స్థానంలో చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని డాక్టర్ అయాతుంగయ్ చెప్పారు.