హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నియామకం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల మేరకే కొనసాగుతున్నదని తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ట్రిబ్ ఇటీవల 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ప్రారంభించింది.
అందుకు సంబంధించి పలు సబ్జెక్టుల అభ్యర్థుల ఎంపికకు ధ్రువపత్రాల పరిశీలన బుధవారం సైతం కొనసాగింది. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్ వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెరిట్ ప్రకారం 1:2 జాబితాలో ఉన్నప్పటికీ తమకు అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.