గజ్వేల్/ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 29: తెల్లబంగారం మెరుస్తుంది. రికార్డు స్థాయి ధరలతో రైతులకు సిరులు కురిపిస్తున్నది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.8,431 రికార్డు ధర పలికింది. ఈ నెల 20న ఇక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాగా తొలి క్వింటాల్ రూ.7,960 పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మరోసారి రికార్డు స్థాయికి చేరింది. ఆన్లైన్ బిడ్డింగ్లో క్వింటాల్కు గరిష్ఠంగా రూ.8,100 పలికింది. వారం రోజుల క్రితం క్వింటాల్కు రూ.8 వేలు చెల్లించారు. దాదాపు ఏడు వేల బస్తాల పత్తి వచ్చింది. కాగా, మద్దతును మించి ధరలు వస్తుండటంతో రైతులు సంబురపడుతున్నారు.