చింతలపాలెం, అక్టోబర్ 31: పులిచింతల ప్రాజెక్టులోని టీఎస్ జెన్కోలో అధికారులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ దేశ్యా నాయక్, అధికారులు ఆదివారం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2019-20లో 210 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 4 నెలల్లో 215 మిలియన్ యూనిట్ల మైలురాయిని చేరుకున్నామన్నారు. జెన్కో సీఈ (హెచ్పీసీ) బిచ్చన్న, సీఈ (ఎన్ఎస్పీ) సూర్యనారాయణ జెన్కో సిబ్బందికి ఫోన్లో అభినందనలు తెలిపారు.