హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): రాజకీయ లబ్ధి కోసం నిర్మించిన ‘రజాకార్’ సినిమాను, ప్రస్తుతం విడుదలైన టీజర్ను నిలిపివేయాలని పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి జాతీయ ఫౌండేషన్ సభ్యురాలు, రావి నారాయణ రెడ్డి మనుమరాలు రావి ప్రతిభారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ధి పొందేందుకే రజాకార్ సినిమాలో మతపరమైన అంశాలను పొందుపర్చారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారని వీరి గురించి సినిమాలో ఎందుకు చూపించడం లేదని ఆమె సినీ నిర్మాతలను ప్రశ్నించారు.