హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TSEWIDC) చైర్మన్ పదవికి రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Reddy) రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 21 నెలలు పాటు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో అనేక విద్యాలయాలు, సంక్షేమ భవనాల నిర్మాణాలను భవిష్యత్ తరాలకు అందించడంలో సంస్థ ద్వారా చేసిన కృషి ఒక మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు.
అలాగే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అన్ని సదుపాయాల నడుమ అందించాలనే సంకల్పంతో పుట్టిన కేసీఆర్ మానసపుత్రిక మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా వాటి పనుల పర్యవేక్షణ కోసం జిల్లాల పర్యటనలో జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుంచి మండల, గ్రామ స్థాయి అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం ఒక మంచి అనుభవాన్ని మిగిల్చిందన్నారు. విధి నిర్వాహణలో తనకి అండగా ఉన్న కేటీఆర్ హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.