హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో మనదేశానికి గుర్తింపు తెస్తున్న మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించడం సిగ్గుచేటని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ ఈ వేధింపుల ఆరోపణలు ఎదురోవడం దేశానికి మచ్చతెచ్చే విధంగా ఉన్నదని పేర్కొన్నారు. బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా ఐసీఈయూ (ఎల్ఐసీ) హైదరాబాద్ డివిజన్ మహిళా సబ్ కమిటీ కాన్వాస్పై శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. మ ధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు భోజన విరామ సమయంలో సైఫాబాద్లోని హైదరాబాద్ ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మా ట్లాడారు. కార్యక్రమంలో అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీకాంతమిశ్రా, ఐసీఈయూ డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ మైథిలీ, నాయకులు వీ రమేశ్, రవీంద్రనాథ్, రవి, రాజశేఖర్, తిరుపతయ్య, సుజాత, మద్దిలేటి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.