భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాష్ట్రపతి.. 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు. సారపాకలోని హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం రాములవారి ఆలయానికి చేరుకోనున్నారు. సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజల చేయనున్నారు. తర్వాత ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు.