హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సివిల్స్ ఫలితాల్లో విష్ణు ఐఏఎస్ అకాడమీకి ర్యాంకుల పంట పండినట్టు అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఆంత్రోపాలజీ విభాగంలో శిక్షణపొందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించినట్టు వెల్లడించారు. తమ అకాడమీకి చెందిన ఉమాహారతి మూడో ర్యాంక్ పొందారని చెప్పారు. ఇక నిధి పాయ్ 110 ర్యాంకు, పవన్సాయి సాహిత్య, రవిమీనా, అలోక్కుమార్, దీప్తి చౌహన్, రాహుల్, శశాంక్, సాయినాథ్, అక్షయ్, సుజిత్ సంపత్, విజయ్బాబు, నవీన్లు మంచి ర్యాంకులను కైవసం చేసుకొన్నారని విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన ఘనంగా సన్మానించారు.