చేగుంట, సెప్టెంబర్ 21: మెదక్ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసురెడ్డి (80) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లికి చెందిన వాసురెడ్డి ఉపసర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
1984 నుంచి 1989 వరకు రామాయంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్ఎస్లో చేరి మెదక్ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. వాసురెడ్డికి భార్య పద్మ, కూతుళ్లు వసంత, జయంతి, కుమారుడు చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు. చేగుంట మండలం పోలంపల్లిలో శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.