హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రసుత్తం తెలుగు సినీ పరిశ్రమలో మారుమోగుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ప్రముఖ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించారు. శుక్రవారం సినిమా మొదటి రోజు ప్రీమియర్ షోకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ల బృందం సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున టీఎస్ఆర్టీసీ బస్సులో కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్ వరకు ప్రయాణించారు. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించేలా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.