హైదరాబాద్: అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (Raksha bandhan) సందడి రాష్ట్రమంతా నెలకొన్నది. సామాన్యులతోపాటు మంత్రులు, ప్రముఖుల ఇండ్లలో రాఖీ పౌర్ణమి వేడుకలు సంబురంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆయన సోదరీ మణులు రాఖీ కట్టగా, మంత్రి జగదీశ్ రెడ్డికి ఆయన కూతురు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆయన సోదరి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులతోపాటు నియోజకవర్గంలోని సోదరీమణులు, ఎంపీ సంతోష్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.