హిమాయత్నగర్, ఫిబ్రవరి9: తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహ్మద్ మసూద్ అలీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డ్రాయింగ్ సెక్షన్ పనులకు బిల్లులు చేసేందుకు బాబూరావు అనే కాంట్రాక్టర్ నుంచి అలీ రూ.13 వేలు లంచం అడిగాడు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం హిమాయత్నగర్లోని రాజీవ్ స్వగృహ కార్యాలయంలో బాబూరావు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.