నాంపల్లి కోర్టులు, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖర్రెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండోసారి 12వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య గురువారం బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. జిల్లా కోర్టు నుంచి మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ దాఖలు చేయడం నిబంధనల ప్రకారం సరైందికాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
తద్వారా నిందితుడు రాజశేఖర్రెడ్డి జిల్లా కోర్టునే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 142 రోజులైందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నప్పటికీ సిట్ పీపీ చందు చేసిన వాదనలను కోర్టు ఏకీభవించి ఉత్తర్వులు జారీ చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసే అవకాశాలు శూన్యం. ఇటీవల పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ కూడా డిస్మిస్ అయింది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు మాత్రమే 142 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 96వ నిందితుడి వరకు అందరూ బెయిల్పై విడుదలయ్యారు.