హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పశ్చిమ కనుమల అవతలి వైపు పడే భారీ వర్షపు నీటిని ‘జల సంజీవిని’ ప్రాజెక్టు పేరిట ఐదు సొరంగాల ద్వారా కృష్ణా, గోదావరి పరీవాహక ఉపనదులకు మళ్లించనున్నారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట జవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ లాతూర్కు చెందిన ప్రముఖ ఇంజినీర్ (రిటైర్డ్) పాండురంగ థోడర్తో చర్చించారు. మహారాష్ట్ర కరువు పీడిత ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ ప్రాజెక్టులో సంయుక్తంగా పెట్టుబడులు పెడితే ఈ జలాలను వినియోగించుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్లో పశ్చిమ కనుమల ఇతర వైపుల నుండి కృష్ణా, గోదావరి బేసిన్లు, దాని ఉపనదులకు నీటిని తీసుకురావడానికి 500 మీటర్ల ఎత్తులో ఒకొకటి 5 కిలోమీటర్లు 5 సొరంగాలు అవసరమని పాండురంగ థోడ్కర్ వివరించారు. కాగా, షెతరీ సంఘటన్ అఖిల భారత అధ్యక్షుడు రఘునాథ్ దాదా పాటిల్ కొద్దిరోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబరిచారు. దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. జలసంజీవిని ప్రతిపాదన ఆచరణీయమని, ఈ ప్రాజెక్టుతో దాదాపు 500 టీఎంసీల నీటిని డ్రా చేసుకోవచ్చని ప్రకాష్ అభిప్రాయపడ్డారు.