హైదరాబాద్: మరో 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం (Rain) ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, జగిత్యాల, సిద్దిపేట, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీస్తాయని తెలిపింది.