హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి వరుస పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. రాజ్కోట్-మహబూబ్నగర్, భువనేశ్వర్-యశ్వంత్పూర్, షాలీమార్-చెన్నై స్టేషన్ల మధ్య అక్టోబర్ 7 నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు.
హుబ్లీ-హైదరాబాద్, విజయపుర-హైదరాబాద్ స్టేషన్ల మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.