కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని తెలిపారు. గాంధీ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు.
తొందరలోనే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలోని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని మల్లు రవి తెలిపారు. రాహుల్ త్వరలోనే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.