హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయవాదుల సంఘం 2022-23 సంవత్సర కార్యనిర్వాహక కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వీ రఘునాథ్ గెలుపొందారు. 1,257 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి టీ శ్రీకాంత్రెడ్డిపై 590 ఓట్ల ఆధిక్యత సాధించారు. జెల్లా నరేందర్ 827 ఓట్లు, గుడిపల్లి మల్లారెడ్డి 800 ఓట్లతో కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పాశం కృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి ఎం అజయ్కుమార్పై 293 ఓట్ల మెజార్టీ సాధించారు.
జాయింట్ సెక్రటరీగా ఎస్ సుమన్ 229 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోశాధికారిగా ఎం నాగరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా రాజు, కార్యనిర్వాహక సభ్యుడిగా (30 ఏండ్లు) కొవ్వూరి కృష్ణ కిశోర్ (ఏకగ్రీవం), 15 ఏండ్ల సభ్యత్వ పదవి (మహిళ) బీ కవిత యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ (మహిళ)గా తీగల కన్యాకుమారి (ఏకగ్రీవం) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎన్ అనిరుథ్, రవీందర్రెడ్డి, ఆర్పీ రాజు, పీ రాధిక గెలుపొందారు.